హైదరాబాద్: డిండి ఎత్తిపోతల పథకంలో భాగమయిన సింగరాజుపల్లి, గొట్టిముక్కల రిజర్వాయర్ పనుల వేగం పెంచి ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు డిండి ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. ఇవాళ జల సౌధలో డిండి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని పరిశీలించారు. ప్యాకేజీల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ల పరిధిలోని విద్యుత్ టవర్లను మార్చే పనులు వేగంగా జరిగేలా చూడాలని చెప్పారు. విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదించి పనుల వేగం పెంచాలన్నారు. ప్యాకేజీ-1 లో ప్రధాన కాలువ 3 కిలోమీటర్లకు గాను ఒక కిలోమీటర్ వరకు పనులు పూర్తయ్యాయని, ఈ ప్రధాన కాలువలో మిగిలిన 22 కిలోమీటర్లు నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో ఉన్నాయని, ఈ 22 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ పూర్తయిందని ఇంజనీర్లు చెప్పారు. భూసేకరణకు అవసరమైన చెల్లింపుల ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు మంత్రికి వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm