నిర్మల్: జిల్లాలోని కడెం జలాశయం మూడు వరదగేట్లను ఎత్తి గోదావరిలోకి 19012 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు నిరంతరాయంగా వర్షం కురవడంతో జలాశయంలోకి 12840 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 697.525 అడుగులు (6.972టీఎంసీల) వద్ద ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉండగా, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటిని అధికారులు ప్రధానగేట్ల ద్వారా గోదావరి గుండా ఎల్లంపల్లి జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm