హైదరాబాద్: తాను తేజూని ఫాలో కాలేదని బిగ్బాస్ ఎలిమినేటర్ భానుశ్రీ తెలిపారు. బిగ్బాస్ హౌస్లో కౌశల్తో వివాదానికి సంబంధించిన అంశంపై భానుశ్రీ మాట్లాడుతూ 'కౌశల్ చేయి నాకు తగిలింది కాబట్టే రియాక్టయ్యా. నిజానికి గీత తగిలిందనుకున్నా. కాని కౌశల్ చేయి పెట్టి తీసుకు వెళ్తున్న సంగతి డిస్టాన్స్లో కన్పించింది. అదేంటి అలా చేయి పెడతావా నీవు..?, నీకు తెలియదా..? అమ్మాయి దగ్గర ఎలా ఉండాలో అన్నట్టుగా రియాక్టయ్యా. తేజూ మాటలకు రియాక్ట్ అవ్వలేదు. తేజూ నా కంటే ఎక్కువ రియాక్ట్ అయింది. నేను కౌశల్ని పక్కకి తీసుకెళ్లి మాట్లాడి ఉంటే సరిపోయేది. నన్ను కౌశల్ టచ్ చేసిన సంగతి గీతకు తెలియదు. నాకు చేయి తగిలింది. ఇక్కడ అబద్ధాలు చెప్పడానికి ఏమీ లేదు.' అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm