భువనేశ్వర్: జిమ్ ఇన్స్ట్రక్టర్ (వ్యాయామ బోధకుడు)పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఖందగిరి పీఎస్ పరిధిలోని బహదల్పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జ్యోతిరంజన్ బలియాసింగ్ అలియాస్ టిటాన్ దగ్గరకు వచ్చి ఘర్షణకు దిగారు. ఆ తర్వాత జ్యోతిరంజన్పై దాడి చేయడంతో తీవ్రగాయాలతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm