న్యూఢిల్లీ: ఎయిర్ హోస్టెస్ అనిసియా ఆత్మహత్య కేసులో ఆమె భర్త మయాంక్ సింఘ్వీని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రేపు ఉదయం కోర్టులో హాజరపరచనున్నారు. ఈనెల 13వ తేదీన అనిసియా తన ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త వేధింపుల కారణంగానే అనిసియా ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. తొలుత మయాంక్ సింఘ్వీపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలించి చివరికి అదుపులోకి తీసుకున్నారు. మయాంక్ సింఘ్వీని గంటపాటు విచారించిన పోలీసులు.. అతనిపై వరకట్నం వేధింపుల కింద 304 సెక్షన్ ప్రకారం కేసు నమోదుచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm