ఛత్తీస్గఢ్ : పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. కంకేర్ జిల్లా బందే పరిధిలో సోమవారం ఉదయం ఈ ఘటన జురిగింది. దీంతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన వ్యక్తి తమకు ఇన్ఫార్మర్ కాదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm