లీడ్స్: ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత బ్యాట్స్మెన్ తడబడ్డారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్వల్ప స్కోర్లను భారీ స్కోర్లుగా మలిచే క్రమంలో విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ(71: 72 బంతుల్లో 8ఫోర్లు) అర్ధశతకంతో రాణించగా.. శిఖర్ ధావన్(44: 49 బంతుల్లో 7ఫోర్లు), మహేంద్రసింగ్ ధోనీ(42: 66 బంతుల్లో 4ఫోర్లు) తమదైన శైలిలో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లీష్ బౌలర్లలో రషీద్(3/49), డేవిడ్ విల్లీ(3/40) ధాటిగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో భారత్ 8 వికెట్లకు 256 పరుగులు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm