గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్- మోర్బి హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. వేగంగా వస్తున్న కారు, లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీని బలంగా ఢీనడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm