మేడ్చల్ : రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు మేడ్చల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు శామీర్పేట మండల పరిధిలోని దేవరయంజాల్లోని సంచార పశువైద్య వాహనాలకు (1962 మొబైల్ వాహనాలు) సంబంధించిన జీవీకే ఈఎంఆర్ఐ కాల్సెంటర్ను సందర్శిస్తారు. సంచార పశువైద్య వాహనాల పనితీరు, జిల్లాలో గొర్రెల పంపిణీ పథకం అమలుపై మంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm