హైదరాబాద్ : కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టిలోకి వరద పోటెత్తగా గేట్లను ఎత్తివేశారు. ఈ నీరంతా దిగువన ఉన్న నారాయణపూర్ కు చేరుతోంది. జలాశయం శరవేగంగా నిండుతుండటంతో, నేడు నారాయణపూర్ రిజర్వాయర్ గేట్లను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తుంగభద్ర కూడా నిండుకుండగా ఉండటంతో, ఇక వచ్చే నీరంతా జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుకు పరుగులు పెట్టనుంది. గడచిన పది రోజుల వ్యవధిలో ఆల్మట్టి డ్యామ్ లోకి 95 టీఎంసీల నీరు రావడం గమనార్హం. మొత్తం 1,705 అడుగుల గరిష్ఠ నీటిమట్టం, 129.7 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న ప్రాజెక్టులో ప్రస్తుతం 1,701.87 అడుగుల నీరు, 113.07 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 18 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్న అధికారులు, పరిస్థితిని బట్టి మరిన్ని గేట్లు తెరుస్తామని వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm