ముంబై : పాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని డిమాండు చేస్తూ రైతులు ముంబై నగరానికి పాల సరఫరాను నిలిపివేసిన నేపథ్యంలో రైల్వేశాఖ రంగంలోకి దిగింది. అహ్మదాబాద్ నుంచి ముంబై నగరానికి పాలను రైలు ట్యాంకర్ల ద్వార సరఫరా చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ముంబై నగరానికి వెళ్లే రోడ్డు మార్గాల్లో పాల ట్యాంకర్లు రాకుండా రైతులు అడ్డుకుంటున్న దృష్ట్యా గుజరాత్ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రైలు ట్యాంకర్ల ద్వార పాలను సరఫరా చేయనున్నారు. ముంబై లో పాల కొరతను అధిగమించేందుకు రోజులకు 12 ట్యాంకర్ల పాలను రైళ్ల ద్వార పంపించనున్నారు. 44వేల లీటర్ల పాలను ముంబై సెంట్రల్ కు తరలించనున్నారు. లీటరు పాలకు ఐదురూపాయలు సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ స్వాభిమాన్ షేత్కారీ సంఘటన్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm