రంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది. రాజేంద్రనగర్లో ఓ వ్యక్తిని పలువురు దుండగులు హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్లోని హైదర్నగర్లో ఖలీద్ అనే వ్యక్తిని పలువురు దుండగులు బండరాయితో మోది హత్యచేశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm