సూర్యాపేట: లారీ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద అటుగా వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడే ఉన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతిచెందిన వ్యక్తి బాలెంల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm