హైదరాబాద్ : నగరంలోని శిల్పారామంలో ఈ నెల 21, 22వ తేదీల్లో బొంగో మేళాను నిర్వహిస్తున్నట్లు శిల్పా రామం ప్రత్యేక అధికారి కిషన్రావు తెలిపారు. ప్రతి నెల ఒక్కో రాష్ర్టానికి చెందిన సాంస్కృతి, సంప్రదాయాలు, వేషా, భాషాలకు వేధికను అందిస్తూ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా బొంగో మేళా ది బెంగాలీ కల్చరల్ అండ్ కార్నివాల్ను నిర్వహించనున్నట్లు కిషన్రావు వెల్లడించారు. వివిధ రాష్ర్టాల నుంచి వలస వచ్చి నగరంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న వివిధ సంప్రదాయాలకు చెందిన ప్రజలకు ఇదొక చక్కని అవకాశమన్నారు. ఈ కార్యక్రమాన్ని శిల్పారామం, ది బెంగాలీ సర్కిల్ హైదరాబాద్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో స్థిరపడ్డ బెంగాలీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేయాల్సిందిగా తెలిపారు. ఇందులో బెంగాలీ సంప్రదాయాలతో కూడిన వేషభాషలు, ఆహారం, చేనేత వస్ర్తాలు, సంప్రదాయ నృత్యరీతులు ఉండనున్నట్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm