ముంబయి: మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్యలో 639 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటాగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ.. దీనిపై నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక అందజేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. రైతు ఆత్మహత్యలపై స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వాలు సరైన విధంగా స్పందించడం లేదని తెలిపింది. రైతు చనిపోతే వారి కుటుంబాలు కూడా సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. పంట నష్టపోయినా, రుణాలు చెల్లించలేని స్థితిలో ఉన్న ప్రతీసారి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 18,2018 10:48AM