అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఎగువన ఎడతెగని వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యామ్కు వరద నీరు పోటెత్తింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి మరో మూడు అడుగుల చేరువలో ఉంది. ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో 64,825 క్యూసెక్కులు ఉండగా ఔట్ఫ్లో 1,335 క్యూసెక్యులుగా కొనసాగుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1630 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు ప్రవాహం కొనసాగుతుండటంతో తుంగభద్ర బోర్డ్ వరద హెచ్చరికలు జారీ చేసింది. ఏ క్షణంలోనైనా క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు బోర్డ్ సెక్షన్ అధికారి విశ్వనాథ తెలిపారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల అధికారులకు సమాచారం అందజేసినట్లు వెల్లడించారు. ఈ సాయంత్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm