తిరువనంతపురం: కేరళలోని ఎర్నాకులం జిల్లాలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు సెలవును ప్రకటించారు. కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు ఇచ్చారు. అదేవిధంగా కొట్టాయం-ఎట్టమనూర్ పరిధిలో 10 రైళ్ల సేవలను పూర్తిగా నిలిపివేశారు. కాగా ఎర్నాకులం-పునలూరు మధ్య నడిచే రెండు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రైల్వే పీఆర్వో వెల్లడించారు. ఎడతెగని వర్షం, రైలు బ్రిడ్జిల కింద నదీ ప్రవాహ ఉధ్రృతి ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm