ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లోని కోకా పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఇవాళ ఉదయం 8.30 గంటలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టుపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. ఘటనాస్థలి నుంచి ఒక రైఫిల్తో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm