న్యూఢిల్లీ: లోక్సభ మొదలైన వెంటనే విపక్షాలు ఆందోళనకు దిగాయి. కొత్తగా ఎంపికైన ఎంపీల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టిముట్టి నిరసన వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాల్సిందిగా టీడీపీ ఎంపీలు పట్టుబట్టారు. సభలో నినాదాలు చేశారు. విపక్షాల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వశ్చన్ అవర్ తర్వాతే విపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు అనుమతిస్తామని స్పీకర్ తేల్చిచెప్పారు. సభ్యుల నిరసన మధ్య స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు.
Mon Jan 19, 2015 06:51 pm