న్యూఢిల్లీ : రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో జరిగింది. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో సోనాల్ మాన్సింగ్, రఘునాథ్ మహాపాత్ర, రామ్ శకల్, రాకేశ్ సిన్హా, ఎలామారమ్ కరీమ్, జోస్ మణి, బినోయ్ విశ్వమ్ ఉన్నారు. రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసిన వారిలో రైతు నేత రామ్ శకల్, రచయిత రాకేశ్ సిన్హా, శిల్పి రఘునాత్ మహాపాత్ర, క్లాసికల్ డ్యాన్సర్ సోనాల్ మాన్సింగ్ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm