హైదరాబాద్: భాగ్యనగరంలోని కుషాయిగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో వృద్ధురాలి మృతదేహం కుళ్లిన స్థితిలో పడి ఉంది. ఇంట్లో నుంచి దుర్వాసనరావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడకు వచ్చిన పోలీసులకు కుళ్లిన స్థితిలో ఉన్న వృద్ధురాలి మృతదేహం కనిపించింది. కాగా, వృద్ధురాలు ఇసిఐఎల్ రిటైర్డ్ ఉద్యోగి నందిని నాయర్గా పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో నందిని నాయర్ కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటున్నట్లు స్థానికులు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm