నవతెలంగాణ-సిటీబ్యూరో: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జరిగిన రూ.9.6 కోట్ల కుంభకోణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. బ్యాంకు కుంభకోణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షిం చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఎల్ఎఫ్, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భూపాల్ అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ సంద ర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. ఈ కుంభకోణంపై ప్రభుత్వం, పోలీసులు స్పందించకపోవడం దారుణ మన్నారు. ఇండ్లు, భూములు అమ్ముకొని 153 మంది పేదలు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశారని చెప్పారు. డిపాజిటర్ల సొమ్ము రికార్డుల్లో తక్కువ చూపించిన బ్యాంకు సిబ్బంది, అప్పటి మేనేజర్లు సు మారు 9.6 కోట్లను కాజేశారన్నారు. డిపాజిట్దారుల డబ్బులు వడ్డీతో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 18,2018 12:20PM