హైదరాబాద్ : ద్వైపాక్షిక వన్డే సిరీస్ల్లో టీమిండియా సాగిస్తున్న జైత్రయాత్రకు తాజాగా ఇంగ్లండ్లో బ్రేక్ పడింది. ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచిన టీమిండియా చివరి రెండు మ్యాచ్ల్లోనూ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఓడిన కోహ్లీ సేన సిరీస్ను చేజార్చుకుంది. ఈ ఓటమికి కెప్టెన్ కోహ్లీయే బాధ్యత వహించాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంచి ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ను పక్కన పెట్టి దినేష్ కార్తీక్కు తుది జట్టులో చోటు కల్పించాలన్న కోహ్లీ నిర్ణయమే కొంప ముంచిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -వరుసగా విఫలమవుతున్నప్పటికీ రోహిత్ శర్మకు మాత్రం అవకాశాలు కల్పిస్తారు. రాహుల్కు మాత్రం తగినన్ని అవకాశాలు ఇవ్వకుండా జట్టులోనుంచి తీసేస్తున్నార-ని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అలాగే కార్తీక్ను తుది జట్టులోకి తీసుకోవాలనుకుంటే ధోనీని తీసేయాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్ విన్నర్ను జట్టులో నుంచి తప్పించి కోహ్లీ సేన భారీ మూల్యం చెల్లించిందని ట్వీట్లు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 18,2018 12:20PM