హైదరాబాద్ : :కారులో మర్చిపోయిన ప్రయాణికుడి బ్యాగును తిరిగి ఇచ్చేసి నిజాయితీని చాటుకున్నాడో క్యాబ్ డ్రైవర్. ఈనెల 16వ తేదీన సాయంత్రం 5.30గంటలకు అప్పారావు అనేవ్యక్తి బంజరాహిల్స్ నుంచి ఉస్మానియా క్యాంపస్ వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ను బుక్ చేసుకొని అందులో ప్రయాణించాడు. అయితే అప్పారావు రూ.1, 25,000 డబ్బు ఉన్న బ్యాగును క్యాబ్లోనే మర్చిపోయాడు. కొంపల్లిలోని నివాసం ఉండే క్యాబ్ డ్రైవర్ కంచుకుమార్ మంగళవారం తన కారును శుభ్రం చేస్తుండగా అందులో ఉన్న బ్యాగును తీసి చూడగా నగదు కనిపిం చింది. వెంటనే అతను ఆ బ్యాగును పేట్బషీరాబాద్ పోలీసులకు అప్పగించాడు. దీంతో సీఐ రవిచంద్ర, ఎస్ఐ మహేష్లు ప్రయాణికుడికి ఫోన్ చేసి బ్యాగును అతనికి అప్పగించారు. క్యాబ్ డ్రైవర్ నిజాయితీని మెచ్చుకొని అప్పారావు అతనికి 5 వేల నగదును అందజేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm