హైదరాబాద్ : డీఎంకే అధినేత కరుణానిధి గత కొంత కాలంగా గొంతు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ తెల్లవారుజామున ఆయనను చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి ఆయన కుటుంబ సభ్యులు తరలించారు. ఆయనకు స్పల్ప శస్త్ర చికిత్సను నిర్వహించనున్నారు. ఆసుపత్రిలో కరుణానిధి చేరిన విషయాన్ని తెలుసుకున్న డీఎంకే శ్రేణులు భారీ ఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. ఆసుపత్రి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే, కరుణానిధి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన స్పష్టమైన వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.
Mon Jan 19, 2015 06:51 pm