హైదరాబాద్ : ముఖ్యమంత్రి పళనిస్వామి (ఇపిఎస్), ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం (ఒపిఎస్) సర్కార్కు ఎఐఎడిఎంకె కార్యకర్తలు షాక్ ఇచ్చారు. జయలలిత మృతి తరువాత పార్టీ సభ్యత్వాన్ని లక్షలాదిమంది కార్యకర్తలు రెన్యూ చేసుకోలేదు. 60 లక్షల మందికిపైగా కార్యకర్తలు తమ సభ్యత్వాలను రెన్యూ చేసుకోలేదు. జయలలిత జీవించి ఉన్నప్పుడు ఒక కోటి 50 లక్షలు దాటిన సభ్యత్వాలు ప్రస్తుతం 90 లక్షలకు పడిపోయాయి. ఇది ఇపిఎస్ ఉ ఒపిఎస్ వర్గానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ 60 లక్షలమంది టిటివి దినకరరన్ పార్టీ వైపు మళ్లారని అనుమానిస్తున్నారు. పార్టీ కేడర్ను తిరిగి తమవైపు తిప్పుకోవడానికి వారు ప్రణాళికలు రచిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm