హైదరాబాద్: పార్టీ అధిష్ఠానం సికింద్రాబాద్ టికెట్ను ఎవరికి ఇచ్చినా తాను మద్దతు ఇస్తానని సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ పార్టీ అధిష్ఠానం ఎవరికిచ్చినా తాను మద్దతిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) స్పష్టంచేశారు. వేరే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు నగర కాంగ్రెస్ సమావేశం నుంచి నిన్న మధ్యలో లేచి వెళ్లిపోయినట్టు తెలిపారు. తెలంగాణలో ఎవరికీ మాట్లాడే స్వేచ్ఛలేదన్న ఆయన స్వామి పరిపూర్ణానంద, కత్తి మహేశ్లపై కేసులు ఎందుకు పెట్టారో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొరవడిందంటూ కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ పార్టీలన్నీ కలిసి చలో ప్రగతిభవన్ నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ఇటీవల సికింద్రాబాద్ లోక్సభ స్థానంపై చేసిన ప్రకటన నిన్న ఇందిరా భవన్లో జరిగిన హైదరాబాద్ నగర పార్టీ సమావేశంలో రసాభాసకు దారితీసింది. ఈ నేపథ్యంలో అంజన్కుమార్ యాదవ్ వర్గీయులు సభలో గందరగోళం సృష్టించారు. అయితే, ఆ సమయంలో సమావేశం నుంచి వీహెచ్ లేచి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm