హైదరాబాద్: బీజేపీపై వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తాజాగా మరో ట్వీట్ చేశారు. సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ పై బీజేవైఎం కార్యకర్తలు దాడికి పాల్పడటంపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ట్వీట్ లో ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు చేశారు. 'ద్వేషం, భయంను ఉపయోగించి అధికారం అనుభవిస్తాను, బలహీనులను అణచివేస్తా.. నేను ఎవరిని?' అంటూ రాహుల్ తన ట్వీట్ లో ప్రశ్నించారు. స్వామి అగ్నివేశ్ పై బీజేవైఎం కార్యకర్తలు దాడికి పాల్పడుతున్న వీడియోను రాహుల్ జతచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm