న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది అటల్ బిహారీ వాజ్ పేయి నిన్న సాయంత్రం తనువు చాలించిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రతి ఒక్కరు ప్రార్ధిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్కి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ఆయన రాసిన పద్యంతో కూడిన వీడియోని షేర్ చేస్తూ నివాళులు అర్పించాడు. క్యా కోయా క్యా పయా జగ్ మేన్ అనే పద్యాన్ని కొన్నేళ్ళ క్రితం అటల్ బిహారీ వాజ్ పేయి రాసారు. ఈ పద్యాన్ని తమ సినిమాలో వాడుకున్నారు యశ్ చోప్రా. ఈ వీడియోని షారూఖ్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ .. తనకి వాజ్పేయితో ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు.
నేను వాజ్పేయి స్పీచ్ వింటూ ఎదిగాను. అప్పట్లో ఢిల్లీలో జరిగే ప్రతి సభకి మా నాన్నగారు తీసుకెళ్లేవారు. సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయనతో కలిసి కథలు, సినిమాలు, రాజకీయాలపై చర్చించే అవకాశం వచ్చింది. మా ఇంట్లో అందరం ఆయనని బాప్జీ అని పిలుచుకుంటాం. ఆయన మరణం దేశానికి తీరని లోటు. వ్యక్తిగతంగా వాజ్పేయి మరణం నా మీద ఎంతో ప్రభావం చూపుతుంది. ఆయన పద్యాలని ఎంతగానో మిస్ అవుతున్నాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Aug 17,2018 10:19AM