ఢిల్లీ: మాజీ ప్రధాని వాజ్ పేయి మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వాజ్ పేయి తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన వాజ్ పేయి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ కోరారు. ఆయన మృతి తీరని లోటన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా, ప్రధానిగా విలువలతో కూడిన రాజకీయాలను నడిపి దేశానికే కాక యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వాజ్ పేయి అని కేసీఆర్ నివాళులు అర్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm