ఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మృతికి పాక్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం తెలిపారు. భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాల బలోపేతానికి వాజ్పేయి చేసిన కృషి, పడిన తపన ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. వాజ్పేయి ఉప ఖండంలోనే గొప్ప నేత అని ఇమ్రాన్ కొనియాడారు. పాకిస్థాన్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ విజయం సాధించింది. కాగా శనివారం ఇమ్రాన్ పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm