ఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ భౌతికకాయాన్ని బీజేపీ జాతీయ కార్యాలయానికి తరలించారు. వాజ్పేయీ నిన్న సాయంత్రం 5.05 గంటలకు కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన భౌతికకాయాన్ని ఎయిమ్స్ నుంచి కృష్ణమీనన్ మార్గ్లోని నివాసానికి తరలించారు. బంధువులు, ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులర్పించారు. ఈరోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆర్మీ, నేవీ చీఫ్లు, కేరళ, తమిళనాడు గవర్నర్లు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు.
అనంతరం వాజ్పేయీ భౌతికకాయాన్ని బీజేపీ జాతీయ కార్యాలయానికి తరలించారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాహనంలో ఆయన పార్థివదేహాన్ని అక్కడికి తీసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు భాజపా కార్యాలయానికి చేరుకున్నారు. ప్రజల సందర్శనార్థం వాజ్పేయీ భౌతికకాయాన్ని మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభం కానుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Aug 17,2018 10:48AM