నాగర్ కర్నూల్: మండల పరిధిలోని డిండి గ్రామం నగర దుబ్బతాండాకు చెందిన బాసు నాయక్ 48 పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తను సాగు చేస్తున్న పొలంలో పంటలు వేయగా ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక పోవడంతో పాటు చేసిన అప్పులు ఇంతకింతకు పెరిగిపోయి దిక్కుతోచని స్థితిలోకి చేరుకొని ఏమి చేయాలో తోచక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతునికి నాలుగురు పిల్లలు ఉన్నారని, మృత దేహాని పోస్టు మార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm