కోదాడ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల జాబితాలో సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డికి అర్జున అవార్డు దక్కింది. మాధురి, మోహన్రెడ్డి దంపతుల కూతురు సిక్కిరెడ్డి. మాధురిది అనంతగిరి మండలం కృష్ణాపురం గ్రామం. సిక్కిరెడ్డి 1993 ఆగస్టు 18 జన్మించింది. అప్పుడప్పుడు కోదాడకు వచ్చి సరదాగా బ్యాడ్మింటన్ నేర్చుకుంది. ఆటలో ప్రావీణ్యతను గుర్తించిన తల్లిదండ్రులు హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేర్చారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆమె అనేక మెడల్స్ సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అర్జున అవార్డు రావడం పట్ల పట్టణ క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm