టోక్యో: జపాన్లో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజిలోకి హ్యాకర్లు చొరబడి దాదాపు రూ.430 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని తస్కరించారు. తమ సర్వర్లోకి హ్యాకర్లు చొరబడి డబ్బును బదలాయించుకున్నట్లు వర్చువల్ కరెన్సీ ఎక్స్ఛేంజి జైఫ్ను నిర్వహిస్తున్న టెక్బ్యూరో వెల్లడించింది. క్రిప్టోకరెన్సీకి జపాన్లో ఆదరణ బాగుంది. ఇక్కడ దాదాపు 50వేల దుకాణాలు ఈ తరహా సొమ్మును ఆమోదిస్తాయి.
Mon Jan 19, 2015 06:51 pm