హైదరాబాద్ : కూల్డ్రింక్లో మత్తుమందు ఇచ్చి ఓ మహిళ దొంగతనానికి పాల్పడింది. అల్వాల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్గౌడ్ వివరాల ప్రకారం.. ఓల్డ్ అల్వాల్ చిన్నన్నతోట భవానీనగర్కు చెందిన చంద్రశేఖర్ కార్పెంటర్. ఈనెల 15న బయటకెళ్లిన చంద్రశేఖర్కు మధ్యాహ్నం సమయంలో ఇంట్లో కిరాయికి ఉంటున్న లావణ్య ఫోన్చేసి మీ భార్య కిందపడిపోయిందని చెప్పింది. దీంతో చంద్రశేఖర్ హుటాహుటిన ఇంటికి చేరుకొని భార్యను దగ్గరలోని దవాఖానకు తరలించాడు. కోలుకున్న వెంటనే భార్యను అత్తగారింటికి పంపించాడు. గురువారం భార్యాభర్తలు ఇంటికి చేరుకోగా.. బీరువాలో ఉంచిన పదమూడున్నర తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. లావణ్య ఇచ్చిన కూల్డ్రింక్ తాగడంతోనే కిందపడిపోయినట్లు నిర్ధారించుకున్న చంద్రశేఖర్ తన భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా లావణ్యను అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm