ప్రేమ వివాహాలు.. ఆత్మహత్యలు.. హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం హైదరాబాద్, యాదాద్రి జిల్లాల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ పెండ్లి విఫలమవడంతో ఒకరు, ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోవాలని గ్రామ పెద్దలు ఒత్తిడి చేయడంతో పెండ్లి జరగాల్సిన రోజే మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు.హైదరాబాద్లోని సంతోష్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఆర్డీవో వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పుగూడ న్యూరక్షాపురం కాలనీకి చెందిన చిట్టిపాక ముత్తయ్య కుమారుడు శ్రీకాంత్(25) మహబూబ్నగర్లో బీఫార్మసీ పూర్తి చేశాడు. అదే ప్రాంతంలో నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలానికి చెందిన జి.శన్ముఖచారీ కుమార్తె గడగోజు శ్రీహర్ష ఎంబీబీఎస్ చదివింది. అక్కడే ఇద్దరూ పరిచయమయ్యారు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి 2015 డిసెంబర్ 16న హైదరాబాద్ పాతబస్తీలో గల లఐనగర్ ఆర్య సమాజ్లో పెండ్లి చేసుకున్నారు. పెండ్లైన తర్వాత శ్రీహర్ష మహబూబ్నగర్లో హాస్టల్లో ఉంటూ మెడిసిన్ చదివింది. ఇద్దరూ దూరంగా ఉండటం వల్ల మనస్పర్ధలు వచ్చాయి. అప్పటికే ఆమె గర్భవతి. ఈ క్రమంలో శ్రీకాంత్ భార్య ఫొటోలన్నీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. శ్రీహర్ష నకిరేకల్ పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్పై ఫిర్యాదు చేసింది. పోలీసులు 498 కింద కేసు నమోదు చేశారు. 2016లో భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, రెండు రోజుల కిందట మహబూబ్నగర్లో వైద్య కళాశాల గోడలకు శ్రీహర్ష వ్యక్తిగత ఫొటోలన్నీ అంటించి కనిపించాయి. ఈ క్రమంలో శ్రీకాంత్ బుధవారం రాత్రి 12 గంటల సమయంలో సంతోష్నగర్ ప్రాంతంలోని డీఆర్డీవో సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆయన్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ గురువారం ఉదయం మృతిచెందాడు. శ్రీకాంత్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm