కోల్కతా: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కేంద్ర మంత్రి, బీజేపీ నాయకులు బాబుల్ సుప్రియో మరోసారి నోరు పారేసుకున్నారు. ఓ వికలాంగుడిని ఉద్దేశించి... కూర్చుంటావా లేక కాళ్లు విరగ్గొట్టాలా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా మంత్రి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి స్థానంలో ఉండి ఇలా ప్రవర్తించడం ఆయన అహంకారాన్ని బయటపెడుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బెంగాల్లోని అసంసోల్లో వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సుప్రియో పాల్గొన్నారు. వికలాం గులకు వీల్చైర్లను ప్రదానం చేయడానికి ఆయన అక్కడికి వెళ్లారు. సుప్రియో వారిని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా మధ్యలో ఓ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి లేచాడు. దీంతో ప్రసంగాన్ని ఆపిన మంత్రి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఃఎక్కడికెళ్తున్నావు? నీ సమస్యేంటి? కూర్చో... లేదంటే నీ కాళ్లు విరగ్గొట్టి స్ట్రెచర్పై పడుకోబెడతాః అంటూ బెదిరించారు. మంత్రి స్థానంలో కార్యక్రమానికి హాజరై ఓ వికలాంగుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని చూసి ఖంగు తినడం అక్కడున్న వారి వంతైంది. కాగా మంత్రి బాబుల్ సుప్రియో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది కొత్తేం కాదు. ఇంతకు ముందు కూడా ఆయన నోరు పారేసుకోవడం విదితమే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 21,2018 07:49AM