నేలకొండపల్లి(ఖమ్మం): టీఆర్ఎస్ నిర్వహించిన ర్యాలీలో గాయపడ్డ వ్యక్తి ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. టీఆర్ఎస్ పాలేరు అభ్యర్థిగా ఎంపికై ఈనెల 14న నియోజకవర్గానికి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు స్వాగతం పలకటానికి నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో కూసుమంచి మండలం మల్లేపల్లి వద్ద నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామానికి చెందిన పాములపాటి సత్యనారాయణ(65) ప్రమాదానికి గురై గాయపడ్డాడు. అప్పటినుంచి ఖమ్మంలోని ఓప్రైవే టు వైద్యశాలలో చికిత్ప పొందుతూ గురువారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల వైద్యశాలకు వెళ్ళి సంతాపం తెలిపి మృతుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm