న్యూఢిల్లీ: పెట్రోల్ ధరల పెరుగుదల శుక్రవారంనాడు కూడా కొనసాగింది. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.82.32కు చేరుకోగా, డీజిల్ 73.87గా ఉంది. ముంబైలో రిటైల్ పెట్రోల్ సరికొత్త రికార్డు సృష్టించింది. లీటర్ పెట్రోల్ 89.69కు, డీజిల్ రూ.78.42కు చేరింది. మెట్రోల్ పాలిటన్ నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కకతాలో గురువారం సైతం రూ.0.6 చొప్పున పెట్రోల్ ధర పెరిగింది. దాంతో ఢిల్లీలో నిన్న లీటర్ పెట్రోల్ రూ.82.22, ముంబైలో రూ.89.60, కోల్కతాలో 84.70కి చేరింది. కాగా, చెన్నైలో లీటర్ పెట్రోల్ 7 పైసలు పెరిగి రూ.85.48కి చేరుకుంది. అయితే ఈ నాలుగు మెట్రో పాలిటన్ సిటీల్లోనూ డీజిల్ ధరలు యథాతథంగానే ఉన్నాయి. గత కొద్ది వారాలుగా ఇంధనం ధరలు పైపైకి పోతుండగా, అంతర్జాతీయ పరిణామాలే ఇందుకు కారణమని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm