మణిరత్నం సినిమా అన్నా, ఆయన సినిమాలోని పాటలన్నా ప్రేక్షకులు చెవి కోసుకుంటారు. మేలిమి ముత్యాల్లాంటి సినిమాలు చేసే మణిరత్నం తాజాగా నవాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఈ చిత్రం చెక్క చివంత వానం (ఎర్రని ఆకాశం తెలుగులో)అనే టైటిల్తో విడుదల కానుంది. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితి రావు హైదరి, డయానా ఎరప్పా, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ మల్టీ స్టారర్ గా రూపొందుతుంది. మణి సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకిస్, లైకా ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది . పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి డబుల్ ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ఈ సినిమాలోని హీరోలంతా అన్నదమ్ములుగా కనిపించనున్నారు. రాజకీయనాయకుడిగా అరవింద్ స్వామి .. ఇంజనీర్ గా శింబు .. పోలీస్ ఆఫీసర్ గా విజయ్ సేతుపతి కనిపిస్తారట. ఈ పాత్రల మధ్య చోటుచేసుకునే సంఘర్షణ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ మూవీకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చెపట్టారు. ఇటీవల భగ భగ, నీలి కనుముల్లో అనే లిరికల్ సాంగ్ వీడియోస్ విడుదల చేసిన టీం తాజాగా నన్ను నమ్మానే లిరికల్ వీడియో సాంగ్తో పాటు సెగలు చిమ్ముతుంది లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. ఇవి సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తున్నాయి. మీరు ఆ సాంగ్స్ విని ఎంజాయ్ చేయండి
Mon Jan 19, 2015 06:51 pm