శ్రీనగర్: దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలోని నలుగురు పోలీసులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. వీరిలో ముగ్గురు స్పెషల్ పోలీస్ అధికారులు (ఎస్పీఓలు), ఒక పోలీసు ఉన్నారు. కప్రిన్, బాటగుండ్ గ్రామాల నుంచి ఉగ్రవాదులు ఈ అపహరణలకు పాల్పడ్డారు. ఈ చర్య వెనుక హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు, ముఖ్యంగా ఎస్పీఓలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని హిజ్బుల్ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ నైకో హెచ్చరికల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm