హైదరాబాద్: శ్రీరామనవమి శోభాయాత్రలో తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వర్గం ప్రజలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ షాయినాథ్గంజ్ పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. 2017 ఏప్రిల్ 9న రాణి అవంతిబాయి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదికపైన రాజాసింగ్ ఓ వర్గం ప్రజలపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, చర్యలు తీసుకోవాలని అప్పట్లో ఎంబీటీ మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్ డబిల్పురా పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతం షాయినాథ్గంజ్ పోలీ్సస్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును ఇక్కడకు బదిలీ చేశారు. విచారణ అనంతరం పోలీసులు గురువారం రాజాసింగ్కు సెక్షన్ 41 ప్రకారం నోటీసులు జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm