చెన్నై : చెన్నై ఎయిర్పోర్టులో ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన బస్సులో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంతో బస్సు ముందుగా స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm