ధర్మాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరుపున ధర్మాబాద్ కోర్టుకు న్యాయవాదలు చేరుకున్నారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడిన కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్పై న్యాయవాది సుబ్బారావు రీకాల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీంతో రీకాల్ పిటిషన్పై కోర్టు ఏం చెబుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో వారెంట్లు అందుకున్న ఏపీ నేతల తరపునా రీకాల్ పిటిషన్ వేసే అవాకాశం ఉంది. మరోవైపు వారెంట్లు అందుకున్న వారిలో తెలంగాణ నేతలు ప్రకాష్గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నం ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm