హైదరాబాద్: పండితులకే పరిమితమైన సాహిత్యాన్ని సాధారణ ప్రజానీకానికి సైతం పరిచయం చేసిన తొలితరం ఆధునిక కవి గురజాడ అప్పారావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. గురజాడ 156వ జయంతి సందర్భంగా ఆయనకు సీఎం నివాళులర్పించారు. కథ, కవితా నాటకాన్ని భావితరాలకు అందించిన వ్యక్తి గురజాడ అని కొనియాడారు. 'దేశమంటే మట్టి కాదోయ్' గేయం తెలుగు ప్రజల్లో సామాజిక దృక్ఫథాన్ని ఇనుమడింపజేసిందని ముఖ్యమంత్రి అన్నారు. 'కన్యాశుల్కం' ద్వారా అంతర్జాతీయ నాటక రంగంలో కూడా తెలుగు వారి ఖ్యాతిని గురజాడ ఇనుమడింపజేశారని సీఎం గుర్తుచేశారు. గురజాడ తెలుగువారిగా పుట్టడం మనందరికీ గర్వకారణమన్న చంద్రబాబు... తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం గురజాడ గుర్తుంటారని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm