ఖమ్మం: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో సత్తుపల్లిలో పర్యటించనున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కేసీఆర్ వల్లే సత్తుపల్లి నియోజక వర్గం సస్యశ్యామలమైందని పేర్కొన్నారు. సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్ట్లకు రూపకల్పన చేశామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడపాలంటే మరోసారి కేసీఆర్ను సీఎం చేయాలని తుమ్మల నాగేశ్వరావు పిలుపునిచ్చారు. శుక్రవారం సత్తుపల్లి మండలం పాకాలగూడెంలోని 20 కుటుంబాలు తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువగా కప్పుకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm