ధర్మాబాద్ : 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టిన ఆందోళనకు సంబంధించి ధర్మాబాద్ కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కోర్టు విచారణకు చంద్రబాబు హాజరుకాలేదు. కోర్టుకు హాజరయ్యేందుకు తనకు సమయంలో లేకపోవడంతో.. తన తరపున లాయర్ ను పంపించారు ముఖ్యమంత్రి. ఆయన తరపున లాయర్ జి.సుబ్బారావు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను రీకాల్ చేయాలంటూ సుబ్బారావు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో, రీకాల్ పిటిషన్ పై కోర్టు ఏం చెబుతుందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. మరోవైపు, అరెస్ట్ వారెంట్లు అందుకున్న మరో 15 మంది కోర్టుకు హాజరయ్యారు. వీరిలో ప్రకాష్ గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నం తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm