హైదరాబాద్ : కంప్యూటర్ రాకతో మానవ సం బంధాలు తగ్గిపోతున్నాయని ఇది చాలా బాధాకరణమైన విషయమని గవర్నర్ నరసింహన్ అన్నారు. వరల్డ్ అల్జిమర్స్ డే సందర్భంగా హైటెక్ సిటీలో రెడ్ క్రాస్ సొసైటీ, నైట్ ఎంజిల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక వల్ల ఆలోచనా శక్తి కోల్పోతున్నారని, కంప్యూటర్ రాకతో మానవ సం బంధాలు తగ్గిపోతున్నాయని ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. పాఠశాల్లో పిల్లలు కనీసం ప్రార్థన కూడా సొంతంగా పాడలేని స్థితిలో ఉన్నారని, కొన్ని పాఠశాలల్లో ఐపాడ్ చూస్తూ ప్రార్థన చేయడం బాధాకరమన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm