జురియా: అస్సాంలో దారుణం జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఓ బోటుకు విద్యుత్తు షాక్ తగిలింది. దీంతో ఆ పడవలో ఉన్న ఆరుగురు మత్స్యకారులు మరణించారు. నగావ్ జిల్లాలోని ఓ చెరువులో ఈ ఘటన జరిగింది. సుమారు 11 వేల వోల్టుల విద్యుత్త తీగ చెరువు నీటిలో పడడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. వేలాడుతున్న విద్యుత్తు తీగలో కరెంటు లేదని అనుకున్న మత్స్యకారులు .. చెరువులోకి దిగిన తర్వాత కరెంట్ షాక్తో చనిపోయారు. అయితే ఆగ్రహానికి గురైన గ్రామస్థులు విద్యుత్తు శాఖ ఆఫీసుపై దాడి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm